ఇదేందయ్యా ఇది.. నేనెప్పుడూ సూడలా..!

ఇదేందయ్యా ఇది.. నేనెప్పుడూ  సూడలా..!

మ‌హీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మ‌హీంద్రా సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో మ‌న‌కు తెలియంది కాదు. సంద‌ర్భాన్ని బ‌ట్టి స్పందిస్తూ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తారు.

తాజాగా బీహార్ కు చెందిన ఇంటాసార్ అలాం అనే వ్య‌క్తికి మ‌హింద్రా గ్రూప్ కు చెందిన స్కార్పియో అంటే చాలా ఇష్టం. స్కార్పియో పై ఉన్న ప్రేమ‌తో.. త‌న అపార్ట్ మెంట్ పై వాట‌ర్ ట్యాంక్ ను ఏర్పాటు చేశాడు. అయితే స్కార్పియో ఆకారంలో ఉన్న వాట‌ర్ ట్యాంక్ ను టెర్ర‌స్ పై ఎలా నిర్మించార‌ని య‌జ‌మాని అలాం ను ప్ర‌శ్నించ‌గా..ఆగ్రాకు చెందిన ఓ వ్య‌క్తి స్కార్పియో వాట‌ర్ ట్యాంక్ ల‌ను త‌యారు చేస్తాడ‌ని తెలుసుకొని అక్క‌డికి వెళ్లిన‌ట్లు చెప్పాడు. ఆగ్రాలోని బ‌హ‌ఘ‌ల్ పూర్ స‌ద‌రు త‌యారీదారుడికి రూ.2.5ల‌క్ష‌లు ఇచ్చి త‌యారు చేయించిన‌ట్లు తెలిపారు.

అయితే బీహార్ స్కార్పియో వాట‌ర్ ట్యాంక్ గురించి తెలుసుకున్న ఆనంద్ మ‌హీంద్రా .., ఆఫోటోల్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆనంద్ మ‌హీంద్రా ఇంటియ‌జ‌మాని అలాం ఐడియాకు ఫిదా అయ్యారు. మీకు అభినంద‌న‌లు. మ‌హీంద్రా గ్రూప్ కు చెందిన స్కార్పియో పై మీరు చూపిస్తున్న అభిమానానికి సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు.