ఏపీలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాలలో కొత్తగా ఏర్పాటు చేసిన జేసీ రెవెన్యూ, జేసీ అభివృద్ధి, జేసీ సంక్షేమం పోస్టులకు వీరిని నియమించింది. ఈ మూడు పోస్టులలోనూ పలువురు ఐఏఎస్లను నియమిస్తూ జగన్ సర్కార్ ఆదివారం ఉత్తర్వులను జారీ చేసింది.
జిల్లాల వారీగా బదిలీలైన ఐఏఎస్ ల వివరాలు
శ్రీకాకుళం జేసీ (రెవెన్యూ)గా సుమిత్ కుమార్
శ్రీకాకుళం జేసీ(అభివృద్ధి)గా కె. శ్రీనివాసులు
విజయనగరం జేసీ( రెవెన్యూ)గా క్రైస్ట్ కిషోర్ కుమార్
విజయనగరం జేసీ(అభివృద్ధి)గా మహేశ్ కుమార్
విశాఖ జేసీ(రెవెన్యూ)గా వేణుగోపాల్రెడ్డి
విశాఖ జేసీ (అభివృద్ధి)గా పి. అరుణ్బాబు
తూ.గో జేసీ (రెవెన్యూ)గా లక్ష్మీషా
తూ.గో జేసీ (అభివృద్ధి)గా కీర్తి
ప.గో జేసీ (రెవెన్యూ)గా వెంకటరామిరెడ్డి
ప.గో జేసీ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా
కృష్ణా జేసీ (రెవెన్యూ)గా మాధవి లతా
కృష్ణా జేసీ(అభివృద్ధి)గా శంకర్ లతోటి
గుంటూరు జేసీ (రెవెన్యూ)గా దినేశ్ కుమార్
గుంటూరు జేసీ (అభివృద్ధి)గా ప్రశాంతి
ప్రకాశం జేసీ (రెవెన్యూ)గా వెంకట మురళి
ప్రకాశం జేసీ (అభివృద్ధి)గా చేతన్
నెల్లూరు జేసీ (రెవెన్యూ)గా వి.వినోద్ కుమార్
నెల్లూరు జేసీ (అభివృద్ధి)గా ఎన్ ప్రభాకర్రెడ్డి
చిత్తూరు జేసీ (రెవెన్యూ)గా మార్కండేయులు
చిత్తూరు జేసీ (అభివృద్ధి)గా వి.వీరబ్రహ్మయ్య
కడప జేసీ (రెవెన్యూ)గా ఎం.గౌతమి
కడప జేసీ (అభివృద్ధి)గా సాయికాంత్ వర్మ
అనంతపురం జేసీ (రెవెన్యూ)గా నిశాంత్కుమార్
అనంతపురం జేసీ (అభివృద్ధి)గా లావణ్యవేణి
కర్నూలు జేసీ (రెవెన్యూ)గా రవిసుభాష్
కర్నూలు జేసీ (అభివృద్ధి) ఎస్.రామసుందర్రెడ్డి
జీఏసీ కి ఢిల్లీరావు
13 జిల్లాల్లో నాన్క్యాడర్ జేసీలందరికీ జేసీ సంక్షేమం బాధ్యతలు అప్పగించారు.