70 ఏళ్ల వయసులోనూ పదో తరగతి పరీక్షలు రాసిన ఎమ్మెల్యే

70 ఏళ్ల వయసులోనూ పదో తరగతి పరీక్షలు రాసిన ఎమ్మెల్యే

చదువుకు వయస్సుతో సంబంధం లేదని ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే నిరూపించారు. 70 ఏళ్ల వయస్సులో పదో తరగతి పరీక్షలు రాసి, చదువుపై తనకున్న ఇష్టాన్ని చాటారు. మధ్యలోనే చదువు ఆపేసిన చాలా మందికి ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ఆదర్శంగా నిలిచారు. 

ఒడిశాలోని కంధమాల్​ జిల్లాలోని ఫుల్బాని నియోజకవర్గం ఎమ్మెల్యే అంగాడ కన్హార్​ (70).. 1978లోనే తన చదువు ఆపేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో రాణించినా పదో తరగతి పూర్తి చేయాలని ఎప్పుడూ అనుకునేవారు. ఈ క్రమంలోనే బోర్డు ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​ (బీఎస్​ఈ) నిర్వహిస్తోన్న హైస్కూల్​ వార్షిక పరీక్షలకు శుక్రవారం (ఏప్రిల్ 29న) హాజరయ్యారు. 
ఎమ్మెల్యే అంగాడ కన్హార్ హాజరైన పరీక్ష కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా పదో తరగతి పరీక్షలకు హాజరై వార్తల్లో నిలిచారు ఎమ్మెల్యే. 

శుక్రవారం ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన బోర్డు పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5.71 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 3,540 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. వారితో పాటు 9378 మంది ఓపెన్​ స్కూల్​, 4443 మంది మాధ్యమ పరీక్షల రాశారు. మే 6 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

కేటీఆర్ వ్యాఖ్యలు కరెక్టే.. కావాలంటే వీడియో చూడండి

యువతులను కాపాడిన ఇండియన్ ఆర్మీ