వాళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్.. కానీ ఇప్పుడు : ఎమోషనలైన అంకిత

వాళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్.. కానీ ఇప్పుడు : ఎమోషనలైన అంకిత

సింహాద్రి(Simhadri) సినిమాలోని చీమ చీమ సాంగ్ తో తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది ముంబై బ్యూటీ అంకిత(Ankitha). ఆ సినిమా తరువాత కూడా చాలా సినిమాల్లోనే నటించింది కానీ.. ఆ ఫేమ్ ను కాపాడుకోలేకపోయింది ఈ బ్యూటీ. వరుస ఆఫర్స్ పలకరించినా.. ఎందుకో ఈ అమ్మడుకు అదృష్టం కలిసిరాలేదు. అందుకే 2009లో సినిమాలకు బై బై చెప్పేసి ముంబైకి చెందిన వ్యాపారావేత్తను పెళ్లిచేసుకొని సెటిల్ అయ్యింది.

చాలా కాలంగా సినిమాలకు మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్న అంకిత.. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అంకిత తన సినిమా జీవితం, తన వ్యక్తిగత జీవితం గురుంచి ఆసక్తికర విషయాలు  చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగానే తన క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్తి అగర్వాల్, ఉదయ్ కిరణ్ గురించి చెప్తూ ఎమోషనలయ్యింది. 

"ఇండస్ట్రీలో నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఉదయ్ కిరణ్(Uday kiran), ఆర్తి అగర్వాల్(Arthi agarwal). మేము చాల క్లోజ్ గా ఉండేవాళ్ళం. కానీ వాళ్లిద్దరూ ఇప్పుడు మనతో లేరని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంటుంది. మా సిస్టర్ పెళ్ళికి కూడా ఆర్తి అగర్వాల్ వచ్చింది. తను సినిమాలు మానేశాక అమెరికాలోనే ఉండేది. అక్కడ మేము రెగ్యులర్ గా కలుసుకునేవాళ్ళం. ఇక ఉదయ్ కిరణ్ తో నేను ఒక సినిమా చేయాల్సింది కానీ.. ఎందుకో ఆ సినిమా ఆగిపోయింది. హైదరాబాద్ వస్తే తప్పకుండా కలిసేవాళ్ళం. అంటూ చాలా ఎమోషనల్ అయ్యింది అంకిత. ప్రస్తుతం అంకిత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.