
- అడ్డొచ్చిన యువకుడు, హాస్టల్ నిర్వాహకులపై దాడి
కూకట్పల్లి, వెలుగు: కేపీహెచ్బీ కాలనీలో దుర్గాప్రసాద్అలియాస్అన్నవరం గ్యాంగ్ వీరంగం సృష్టించింది. మద్యం మత్తులో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించి, అడ్డొచ్చినవారిపై దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ మూడో రోడ్డులోని శ్రీసూర్య బాయ్స్హాస్టల్ సమీపం నుంచి శనివారం అర్ధరాత్రి ఓ యువతి నడుచుకుంటూ వెళ్తోంది.
అన్నవరం గ్యాంగ్లోని దాదాపు 10 మంది ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. అక్కడే ఉన్న వెంకటేశ్ అనే యువకుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రాణభయంతో హాస్టల్లోకి పరుగెత్తినా వదలలేదు. హాస్టల్ నిర్వాహకులపైనా దాడికి పాల్పడి, కిటికీల అద్దాలు ధ్వంసం చేసి పరారయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.