
న్యూఢిల్లీ: అనిల్ అంబానీపైనా, రిలయన్స్ కమ్యూనికేషన్స్పైనా రూ. 2,929 కోట్ల ఎస్బీఐ లోన్మోసం కేసులో కొత్త కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసింది. సీబీఐ నివేదిక ఆధారంగా కొత్త కేసు పెట్టింది. ఎస్బీఐ నుంచి లోన్తీసుకోవడానికి అక్రమాలకు పాల్పడ్డారని, ఆ డబ్బునూ దుర్వినియోగం చేశారని ఆరోపించింది. అనిల్ అంబానీ, ఆయన కంపెనీలపై ఈడీ ఇప్పటివరకు మూడు వేర్వేరు మనీలాండరింగ్ కేసులు ఉన్నాయి. బ్యాంకులను రూ. 17 వేల కోట్లకు పైగా మోసం చేశారని ఈడీ ఆరోపించింది.
సీబీఐ గత నెల నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఎస్బీఐను మోసం చేసి రూ. 2,929.05 కోట్ల నష్టానికి కారణమైనట్లు రిలయన్స్ కమ్యూనికేషన్స్పైనా దాని మాజీ చైర్మన్ అనిల్ అంబానీపైనా ఆరోపణలు ఉన్నాయి. రుణాలను దుర్వినియోగం చేశారని ఇప్పటి వరకు మూడు బ్యాంకులు అనిల్ అంబానీపై ఆరోపణలు చేశాయి.