కోర్టులో ఫేక్ కోవిడ్ సర్టిఫికేట్..అఖిలప్రియ భర్తపై కేసు

కోర్టులో  ఫేక్ కోవిడ్ సర్టిఫికేట్..అఖిలప్రియ భర్తపై కేసు

భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పై మరో కేసు నమోదయ్యింది.ఫేక్ కోవిడ్ సర్టిఫికేట్  ఇచ్చారని  బోయిన్ పల్లిలో పీఎస్ లో భార్గవ్ రామ్ ,జగత్ విఖ్యాత్ రెడ్డితో పాటు నకిలీ రిపోర్టు ఇచ్చిన వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బోయిన్ పల్లిలోని ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులు నిందితులుగా ఉన్న భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలను  ఈ నెల 3 న కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా హాజరుకాలేమని కోర్టులో కోవిడ్ సర్టిఫికేట్ సమర్పించారు. కోర్టులో ఫేక్ సర్టిఫికేట్ సమర్పించారని అభియోగం నమోదయ్యింది. దీంతో బోయినపల్లి పోలీసులు ఆస్పత్రికి వెళ్లి కోవిడ్ సర్టిఫికేట్ ను పరిశీలించగా అది ఫేక్ అని తేలింది. ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చిన ఆస్పత్రి సిబ్బందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.