
హైదరాబాద్ ధూల్పేటకు చెందిన ఫ్యామిలీ ఆందోళన
పద్మారావునగర్ (హైదరాబాద్), వెలుగు: కరోనా పాజిటివ్ వచ్చిందని తన సోదరుడిని గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లారని, 15రోజులుగా ఆయన ఆచూకీ తెలియడంలేదని హైదరాబాద్ లోని ధూల్ పేటకు చెందిన ముకేశ్ సింగ్ వాపోయాడు. పోలీసులకు కంప్లైంట్ చేశామని, ఎవరిని అడిగినా చెప్పడంలేదని పేర్కొన్నాడు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా.. వైరల్ గా మారింది. ముకేశ్ చెప్పిన డీటైల్స్ ప్రకారం.. ధూల్ పేటకు చెందిన నరేందర్ సింగ్ గత నెల 30న హెల్త్ ప్ర బ్లమ్ తో కింగ్ కోఠి హాస్పిటల్ కు వెళ్లాడు. అక్కడ టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో హెల్త్ సిబ్బంది నరేందర్ సింగ్ ను గాంధీ హాస్పిటల్ కు తరలించారు.
ఆ రోజుసాయంత్రం, మర్నాడు నరేందర్ సింగ్ ఇంట్లోవాళ్లతో మాట్లాడాడు. హాస్పిటల్లో ఎవరూ పట్టిం చుకోవడంలేదన్నాడు. తర్వాతి నుంచి నరేందర్ ఫోన్ స్విచాఫ్ వస్తోందని ఆయన సోదరుడు ముకేశ్ చెప్పాడు. దీనిపై మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, డాక్టర్లు తన సోదరుడిని చూపించకపోతే కోర్టుకు వెళ్తానని పేర్కొన్నాడు.