
కరోనా సోకి ఎంసెట్ మిస్సయిన విద్యార్థులకు మరో అవకాశమిచ్చింది JNTUH. ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీలోపు పాజిటివ్ వచ్చి పరీక్ష రాయని విద్యార్థులు ఈసారి రాయొచ్చన్నారు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్. విద్యార్థులు తప్పని సరిగా పాజిటివ్ రిపోర్టును ఈ నెల 5 వ తేదీ లోపు తమకు పంపాలన్నారు. ఎంసెట్ వెబ్ సైట్ లో కరోనా అండర్ టేకింగ్ ఫామ్ అందుబాటులో ఉంటుందన్నారు కన్వీనర్.