బీఆర్ఎస్ లో చేరిన ఏనుగుల రాకేశ్‌ రెడ్డి

బీఆర్ఎస్ లో చేరిన ఏనుగుల రాకేశ్‌ రెడ్డి

ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన  ఏనుగుల రాకేశ్‌ రెడ్డి  బీఆర్ఎస్ లో చేరారు.  తెలంగాణ భవన్ లో  మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాకేష్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్.  ఈ  సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు తనవంతుగా కృషి చేస్తానని చెప్పారు.   వరంగల్‌ వెస్ట్ నుంచి టికెట్ ఆశించిన రాకేశ్‌ రెడ్డి టికెట్ ద‌క్కక‌పోవ‌డంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు.  ఈ క్రమంలో బీజేపీకి రాజీనామా చేశారు.  కాగా  వరంగల్‌ వెస్ట్ టికెట్‌ను రావు పద్మకు కేటాయించింది బీజేపీ. 

ALSO READ :- Diwali Special: దీపావళి రోజున పాత ప్రమిదలు వాడొచ్చా... కొత్తవి కొనాలా....