
కరోనా ఎఫెక్ట్ తో ఏపీలో టెన్స్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. మార్చి 31నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు.రెండువారాల పాటు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనేది మార్చి 31 తర్వాత పరిస్థితి సమీక్ష నిర్వహించి ప్రకటిస్తామన్నారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7కు చేరింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిచెందకుండా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎంసెట్, ఐసెట్ అప్లై డేట్ లను కూడా పొడిగిస్తున్నామని చెప్పారు.