రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగిస్తారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఉదయం 9.30 గంటలకు చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతలు భేటీ కానున్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన నినాదాలు చేసుకుంటూ అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్తారు. సమావేశాలు ప్రారంభమైన వెంటనే గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. అనంతరం అసెంబ్లీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశంలో సీఎం జగన్, శాసనసభా వ్యవహారాల మంత్రి, ప్రతిపక్షం తరపున టీడీపీ నేత అచ్చెన్నాయుడు పాల్గొంటారు. అనంతరం అసెంబ్లీ షెడ్యూల్‌ ఖరారు చేస్తారు. తర్వాత సచివాలయంలో కేబినెట్‌ భేటీ అవుతుంది.
 

ఇవి కూడా చదవండి