అక్టోబర్ రెండో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అక్టోబర్ రెండో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: అక్టోబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలునిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కరోనా వ్యాప్తి నేపధ్యంలో మూడు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సిద్ధంగా ఉండాల్సిందిగా ఆయా శాఖల మంత్రులు.. ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. అక్టోబర్ ఒకటో తేదీన జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో శాసనసభ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.