
స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై సందేహాలు వద్దని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది అన్నారు. ఈవీఎంలను భద్రపరిచిన గదుల్లోకి ఎవరికి ప్రవేశం ఉండదని, స్ట్రాంగ్రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఉందని ఆయన తెలిపారు. పార్టీలు, అభ్యర్ధులు సందేహాల నివృత్తి కోసం.. తమ ఏజెంట్లను స్ట్రాంగ్రూమ్ కంట్రోల్ రూముల్లో ఉంచవచ్చన్నారు. ఈవిఎంలు భద్రపరిచిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఉండదని, .వైఫై ద్వారా ఈవిఎంలను నియంత్రిస్తారనేది కేవలం అపోహ మాత్రమే అని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్రూమ్లపై వచ్చినవి కేవలం పుకార్లు మాత్రమేనని, స్ట్రాంగ్ రూమ్లలో ఈవిఎంలు సురక్షితంగా ఉన్నాయన్నారు. పుకార్లను ప్రచారం చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసామని సీఈవో గోపాల కృష్ణ అన్నారు.
గుంటూరు సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో అమర్చిన సీసీ కెమెరాలు చాలాసేపు నిలిచిపోచాయి. ఈవీఎంలను భద్రపరిచిన గదిలోని కెమెరాల నుంచి అనుక్షణం ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తుండగా, రాత్రి నుంచి పలు కెమెరాలు పనిచేయలేదు. విషయాన్ని గమనించిన కొందరు టీడీపీ కార్యకర్తలు ఆందోళనతో తమ నేతలకు కబురు పంపారు. తెలుగుదేశం నాయకులు ఆ ప్రాంతానికి చేరుకుని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సీఈవో.. అధికారులను పంపి, సీసీ కెమెరాలను సరిచేయించారు.