షర్మిల తనయుడి నిశ్చితార్థ వేడుకకు హాజరైన సీఎం జగన్ దంపతులు

షర్మిల తనయుడి నిశ్చితార్థ వేడుకకు హాజరైన సీఎం జగన్ దంపతులు

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు, తన మేనల్లుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు. జనవరి 18వ తేదీ గురువారం హైదరాబాద్‌ గండిపేటలోని ఒక రిసార్టులో షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి నిశ్చితార్థం చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగ జగన్.. వదవరులిద్దరికీ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభకార్యానికి వైఎస్‌ కుటుంబ సభ్యులు, బందుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత, మంచు మోహన్ బాబు దంపతులు, మంచు విష్ణు దంపతులతోపాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఫిబ్రవరి 17న రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహం జరగనుంది. ఈ  వివాహ వేడుకకు హాజరుకావాలని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, కాంగ్రెస్ పెద్దలు, తెలంగాణ మంత్రులతోపాటు పలువరు ప్రముఖులను షర్మిల స్వయంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.