నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్

అమరావతి, వెలుగు: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు.రెండ్రోజుల పర్యటనలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, పలువురుకేంద్ర మంత్రులను  కలవనున్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరనున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధిప్యాకే జీ నిధుల విడుదల, రెవెన్యూ లోటు భర్తీ,కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్ నిర్మాణం, దుగరాజపట్నం సహా కేంద్రం హామీ ఇచ్చిన పలుపోర్టుల నిర్మాణాలను తక్షణమే చేపట్టాలనివిజ్ఞప్తి చేయనున్నారు. విభజన చట్టం లోనిపెండింగ్‌‌‌‌ అంశాలపై రాష్ర్ట ప్రభుత్వ నివేది-కను అందజేయనున్నారు. ఏపీ, తెలంగాణచేపట్టే ఉమ్మడి ప్రాజెక్టుకు సపోర్ట్ చేయాలని ప్రధాని మోడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.