
రాష్ట్రంలో ఉన్న బార్ల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలన్నారు ఏపీ సీఎం జగన్. బార్ల పాలసీపై జగన్ సమీక్ష నిర్వహించారు. స్టార్ హోటళ్లు మినహా ప్రస్తుతం ఉన్న 798 బార్లను 40 శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సమీక్షలో బార్ల సంఖ్యను 50 శాతానికి తగ్గించాలన్నారు సీఎం జగన్. అయితే ఇప్పటికే మద్యం దుకాణాలను 20శాతానికి తగ్గించామని.. విడతల వారీగా తగ్గిద్దామన్నారు. సుదీర్ఘ చర్చ తర్వాత బార్ల సంఖ్యను 40శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. బార్లలో మద్యం సరఫరా ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకు. భోజనం కోసం 11 వరకు తెరిచి ఉంచాలి. బార్లలో అమ్మే మద్యం ధరలను పెంచే ఆలోచనలో ఉంది ప్రభుత్వం
మద్యం కల్తీకు పాల్పడినా, స్మగ్లింగ్ చేసినా, నాటుసారా తయారు చేసినా కఠిన చర్యలతో పాటు నాన్బెయిల్బుల్ కేసులు నమోదు చేస్తామన్నారు. లైసెన్స్ ఫీజుకు 3 రెట్లు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మద్యం, ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టాలు తీసుకువస్తామన్నారు సీఎం.