మోడీకి పాదాభివందనం చేయబోయిన జగన్

మోడీకి పాదాభివందనం చేయబోయిన జగన్

రేణిగుంట విమానాశ్రయంలో ఆదివారం సాయంత్రం ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం జగన్ పాదాభివందనం చేయబోయారు. విదేశీ పర్యటన ముగించుకొని తిరుమల శ్రీవారి దర్శనం కోసం రేణిగుంట చేరుకున్న మోడీకి సీఎం జగన్ స్వాగతం పలికారు. అందులో భాగంగా ప్రధానికి పుష్పగుచ్ఛం అందించిన అనంతరం పాదాభివందనం చేయబోయారు జగన్. అందుకు మోడీ సున్నితంగా వద్దని తిరస్కరించారు. ఆ తర్వాత జగన్ తన పార్టీ నేతలను ప్రధానికి పరిచయం చేస్తూ స్వాగతం కార్యక్రమం ముగించారు.