ఏపీలో భారీగా తగ్గిన కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే

ఏపీలో భారీగా తగ్గిన కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ నెల ఆరంభం నుండి రోజు రోజుకూ కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా గడచిన 24 గంటల్లో కేవలం 244 కొత్త కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18,803 మందికి పరీక్షలు చేయగా 244 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే చిత్తూరు, కష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు కోలుకోలేక మరణించారు.

మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 662 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 3 కోట్ల 30 లక్షల 10 వేల 692కు చేరుకుందని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నమోదైన కొత్త కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 47 కేసులు, అతి తక్కువగా విజయనగరం జిల్లాలో రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయని వైద్యశాఖ ప్రకటించింది. జిల్లాల వారీగా నమోదైన కొత్త కేసుల వివరాలు కింది పట్టికలో చూడండి..

 

 

 

ఇవి కూడా చదవండి

రాష్ట్ర  ప్రభుత్వంతో యుద్ధం చేసి ఉద్యోగాలు సాధించాలి

ప్రజల కష్టార్జితాన్ని కాంట్రాక్టర్లకు కట్టబెడుతుండు

మధ్యప్రదేశ్లో ‘తెలుగు వెలుగు’