చంద్రబాబుకు ఝలక్..18 జీవోలు రద్దు చేసిన సీఎస్

చంద్రబాబుకు ఝలక్..18 జీవోలు రద్దు చేసిన సీఎస్

ఏపీ సీఎం చంద్రబాబుకు రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఝలక్ ఇచ్చారు. ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా పోలింగ్ తర్వాత ప్రభుత్వం జారీ చేసిన 18 జీవోలను రద్దు చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఎల్వీ సుబ్రహ్మణ్యం రద్దు చేశారు. అలాగే చంద్రబాబు నిర్వహించే సమీక్షా సమావేశాలకు హాజరైన 16 మంది అధికారులు వివరణ ఇవ్వాలంటూ ఈసీ నోటీసులు జారీ చేసింది.