
పోలవరం ప్రాజెక్టుని అడ్డుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోతామన్నారు లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ. విశాఖలోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన YSR స్మారక కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వాస్తవ రాజకీయాన్ని సమర్థంగా నడిపిన ఘనత YSRదే నన్నారు. గోదావరి జలాలను ఎగువకు తరలించేందుకు తెలంగాణతో కలిసి ప్రతిపాదిస్తున్న పథకం నష్టదాయకమని జేపీ స్పష్టం చేశారు.