
హైదరాబాద్, వెలుగు: కేసీ (కర్నూలు కడప) కెనాల్ నుంచి ఒక టీఎంసీ జలాలను తుంగభద్ర డ్యామ్ రైట్ బ్రాంచ్ హై లెవల్ కెనాల్ (హెచ్ఎల్సీ)కి మళ్లించుకునేందుకు ఏపీకి తుంగభద్ర బోర్డు అనుమతించింది. ఈ మేరకు బోర్డు సెక్రటరీ ఓఆర్కే రెడ్డి ఏపీతో పాటు సభ్య రాష్ట్రాలకు లేఖ రాశారు. తమ అవసరాల కోసం ఒక టీఎంసీ జలాలను కేసీ కెనాల్ నుంచి హెచ్ఎల్సీకి మళ్లించుకునేందుకు అనుమతివ్వాలని ఏపీ ఇటీవల బోర్డుకు లేఖ రాసింది.