
తిరుపతి: అలిపిరి దగ్గర ఉన్న టోల్గేట్ ఛార్జీలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న టోల్గేట్ ఛార్జీల్లో సవరణలు చేసింది. టోల్ చార్జీలను పెంచుతూ గతేడాది మార్చిలో తితిదే బోర్డు చేసిన తీర్మానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. అలిపిరి ఘాట్రోడ్డులో వెళ్లే బైక్ల టోల్ఫీజును పూర్తిగా రద్దు చేసింది. ఇకపై కార్లు, జీపులు, టాటాఏస్, టాక్సీలకు రూ.15 నుంచి రూ.50 మినీ బస్సులు, మినీ లారీలకు రూ.50 నుంచి రూ.100కి పెంచింది. లారీ, బస్సుల టోల్ ఫీజును రూ.100 నుంచి రూ.200కు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.