రాజధాని అమరావతికి ల్యాండ్ పూలింగ్ అంశంపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతికి రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు ఆమోదం తెలిపింది ఏపీ క్యాబినెట్. మొదటి దశలో 34 వేల ఎకరాలు సేకరించాలని.. రెండో దశలో మరో 16 వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది ప్రభుత్వం.ఇందుకు సంబంధించిన కసరత్తు చేపట్టింది ప్రభుత్వం. మొదటి దశలో ప్రభుత్వ భూమి 16 వేల ఎకరాలు సీఆర్డీఏకు అప్పగించింది ప్రభుత్వం. రాజధాని కోసం మొత్తం 50 వేల ఎకరాలు రైతుల నుంచి భూసమీకరణ చేపట్టాలని భావించింది ప్రభుత్వం.
రెండో విడత ల్యాండ్ పూలింగ్ మొదటి దశలో 34 వేల ఎకరాలు, రెండో దశలో 16 వేల ఎకరాలు సేకరించేందుకు కసరత్తు మొదలు పెట్టింది సర్కార్. త్వరలోనే ల్యాండ్ పూలింగ్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనుంది సీఆర్డీఏ. రైతుల నుంచి సేకరించిన మొత్తం 74 వేల ఎకరాలలో రాజధాని నిర్మాణం చేపట్టనుంది ప్రభుత్వం.
ఇక రెండో విడతకు సంబంధించి 7 గ్రామాల్లో భూసేకరణ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం.వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, ఎండ్రాయిలో 2,166 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, పెదమద్దూరులో 1,145 ఎకరాలు, వడ్డమానులో 1,913 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,418 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాల సమీకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ అసైన్డ్ భూములతో కలిపి మొత్తం 20, 494 ఎకరాల భూ సేకరణ ద్వారా సేకరించనుంది సీఆర్డీఏ.
