అమూల్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం

అమూల్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం అమూల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం జగన్‌ సమక్షంలో అగ్రిమెంట్ పేపర్లపై స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్‌ చెన్నై జోనల్‌హెడ్‌ రాజన్‌ సంతకాలు చేశారు.

ఈ  సందర్భంగా జగన్‌ మాట్లాడారు. రాష్ట్ర మహిళల జీవితాలను మార్చే క్రమంలో ఈ ఒప్పందం ఓ గొప్ప అడుగు అని అన్నారు. మహిళా పాడిరైతులు ఆర్థికంగా, తద్వారా సామాజికంగా ఎదగడానికి ఈ ఒప్పందం ఉపకరిస్తుందని తెలిపారు. ఇకపై ప్రభుత్వ సహకార డెయిరీలకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నామని… డెయిరీ రంగంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏపీ ముఖద్వారంలా నిలుస్తుందన్నారు.

ఈ ఒప్పందంతో ఏపి పాడిరైతులకు మెరుగైన ధర దక్కడమే కాకుండా, వినియోగదారులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్నారు సీఎం జగన్. రాష్ట్రంలోని సహకార సంఘాల డెయిరీలకు ప్రపంచస్థాయి డెయిరీ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో పాటు…. విస్తారమైన మార్కెటింగ్ అవకాశాలు ఏర్పడతాయన్నారు.