రంజాన్ స్పెషల్.. ముస్లీం ఉద్యోగులు గంట ముందే వెళ్చొచ్చు

రంజాన్ స్పెషల్.. ముస్లీం ఉద్యోగులు గంట ముందే వెళ్చొచ్చు

రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం గంట ముందు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగులందరితో పాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ఉద్యోగులందరికి ఇది వర్తిస్తుంది. మే 6 నుంచి జూన్ 5వ తేదీ వరకు ముస్లిం ఉద్యోగులు తమ మత పరమైన ఆచారాలు నిర్వర్తించడానికి  సాయంత్రం ఒక గంట ముందు ఆఫీసు, స్కూల్  నుండి వెళ్లడానికి అనుమతి ఇచ్చింది.