సదాశివపేట మున్సిపల్​ చైర్మన్​గా అపర్ణపాటిల్​

సదాశివపేట మున్సిపల్​ చైర్మన్​గా అపర్ణపాటిల్​

సదాశివపేట, వెలుగు : సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ చైర్​పర్సన్​పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఫిబ్రవరి 9న చైర్​పర్సన్​పిల్లోడి జయమ్మపై 22 మంది కౌన్సిలర్లు కలెక్టర్​కు అవిశ్వాస తీర్మాన పత్రం అందజేశారు. సోమవారం మున్సిపల్​ఆఫీసులో ఆర్డీవో వసంతకుమారి అధ్యక్షతన కొత్త చైర్​పర్సన్ ఎన్నుకునేందుకు బలనిరూపణ పెట్టారు.

22మంది కౌన్సిలర్లు కొత్త చైర్మన్​గా 26వ వార్డు కౌన్సిలర్​ అపర్ణపాటిల్​ను ఏకగ్రీవంగాఎన్నుకున్నారు. అనంతరం ఆర్డీవో చైర్​పర్సన్​గా అపర్ణపాటిల్​కు  నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో కమిషనర్​ఉమా, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఖాతాలో సదాశివపేట మార్కెట్​ కమిటీ

సదాశివపేట మార్కెట్​ కమిటీ చైర్మన్​ పీఠం కాంగ్రెస్​ ఖాతాలోకి చేరింది. చైర్మన్​గా  సడాకుల కుమార్​, వైస్​ చైర్మన్​గా కంది కృష్ణను నియమించారు. సోమవారం మార్కెట్​ కమిటీ ఆఫీసులో చైర్మన్​, వైస్​ చైర్మన్, డైరెక్టర్లను ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన వారికి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి నియామకపత్రాలు అందజేశారు. అనంతరం మార్కెట్​ కమిటీ ఆఫీసర్లు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.