ఒక అపార్ట్ మెంట్ లో 18 ఇంకుడు గుంతలు

ఒక అపార్ట్ మెంట్ లో 18 ఇంకుడు గుంతలు
  • పెరిగిన గ్రౌండ్ వాటర్ 
  • రూ. 7లక్షల వరకు ఆదా 

పద్మారావునగర్​, వెలుగు: సమ్మర్ లో నీటి ఎద్దడితో కష్టాలు పడిన అపార్ట్​మెంట్ వాసులు ఇంకుడు గుంతలు తీసుకుని ఆదర్శంగా నిలిచారు. బన్సీలాల్​పేట డివిజన్​బోయిగూడ వై జంక్షన్​ వద్ద ఎంఎన్​కే విఠల్ సెంట్రల్​కోర్టు అపార్ట్​ మెంట్​లో 90 ప్లాట్లలో 300 మంది నివసిస్తున్నారు.  ప్రతి సమ్మర్ లో నీటి కష్టాలతో ఇబ్బందులు పడుతూ ట్యాంకర్లపై ఆధారపడేవారు. నీటి కష్టాలను అధిగమించేందుకు అపార్ట్ మెంట్​వెల్ఫేర్ ప్రెసిడెంట్​జి.హనుమాండ్లు ఆలోచనకు అండగా నిలిచారు.  

మూడేండ్ల కిందట రెండు ఇంజక్షన్ల బోర్ల చుట్టూ రెండు భారీ ఇంకుడు గుంతలను నిర్మించారు. వీటికి తోడుగా మరో 16  ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. దీంతో  వానాకాలంలో అపార్ట్​ మెంట్ ఆవరణలో కురిసిన వాననీరు వృథాగా పోకుండా18 ఇంకుడు గుంతల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రౌండ్ వాటర్ పెరిగి, సమ్మర్ లో వాటర్ ప్రాబ్లమ్ కు చెక్ పడిందని ప్రెసిడెంట్​హనుమాండ్లు తెలిపారు. ప్రతి సమ్మర్ లో రూ. 7 లక్షల వరకు వాటర్​ ట్యాంకర్లకు ఖర్చు అయ్యేది తప్పిందని పేర్కొన్నారు.