
న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో రూ.390 కోట్ల నికర లాభాన్ని సాధించింది. కిందటేడాది ఇదే పీరియడ్లో వచ్చిన రూ.254 కోట్ల ప్రాఫిట్తో పోలిస్తే ఇది 53.5 శాతం ఎక్కువ. కంపెనీకి రూ. 374 కోట్ల నెట్ ప్రాఫిట్ వస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు. అపోలో హాస్పిటల్స్ బోర్డు 2024–-25 కోసం ఒక్కో ఈక్విటీ షేర్కు 10 రూపాయల ఫైనల్ డివిడెండ్ను రికమండ్ చేసింది. ఇందుకోసం ఈ ఏడాది ఆగస్టు 19 ను రికార్డ్ డేట్గా నిర్ణయించింది. అపోలో హాసిటల్స్కు క్యూ4లో కార్యకలాపాల నుంచి రూ.5,592 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇది కిందటేడాది క్యూ4లో వచ్చిన రూ. 4,944 కోట్లతో పోలిస్తే 13 శాతం ఎక్కువ. కంపెనీ నెట్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రకారం, రూ.372 కోట్ల నుంచి 5 శాతం పెరిగింది.