
హైదరాబాద్, వెలుగు: రక్షణ, వైమానిక, రవాణా వంటి కీలక రంగాలకు ఎలక్ట్రానిక్, ఎలక్ట్రో- మెకానికల్ వ్యవస్థలను డిజైన్ చేసే హైదరాబాద్కి చెందిన అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్, 2025 ఆర్థిక సంవత్సర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ ఆదాయం 2023–24తో పోలిస్తే 51 శాతం వృద్ధి చెంది రూ.562 కోట్లకు చేరుకుంది.
నికర లాభం ఏకంగా 81శాతం పెరిగి రూ.56 కోట్లకు ఎగిసింది. మార్చి క్వార్టర్లో రూ.162.50 కోట్ల ఆదాయంపై రూ.13.96 కోట్ల లాభం వచ్చింది. రాబోయే రెండేళ్లలో తమ ప్రధాన వ్యాపారం ద్వారా ఆదాయం ఏటా 45శాతం నుంచి 50శాతం పెరగవచ్చని భావిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఇటీవల ఐడీఎల్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ని కొనుగోలు చేయడం ద్వారా టైర్-1 డిఫెన్స్ఓఈఎంగా మారాలన్న లక్ష్యానికి మరింత చేరువయ్యామని కంపెనీ తెలిపింది.