భారత ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2 ఏళ్లలో లక్షకు పైగా ఉద్యోగాలు

భారత ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2 ఏళ్లలో లక్షకు పైగా ఉద్యోగాలు

భారత్ లో యాపిల్ కంపెనీ తన రిటైల్ స్టోర్లను మొదలుపెట్టింది. మంగళవారం ముంబైలో తన మొదటి రిటైల్ స్టోర్ ను కంపెనీ సీఈఓ టిమ్ కుక్ తన చేతులు మీదుగా ప్రారంభించారు. రెండో రిటైల్ స్టోర్ ను గురువారం ఢిల్లీలో ప్రారంభించనున్నారు. 

ఈ యాపిల్ ఇనిషియేట్ వల్ల దేశంలో లక్షల జాబ్స్ పుట్టుకొస్తాయని టిమ్ కుక్ వ్యక్తం చేశారు. 24 నెలల్లో ఒక లక్ష ఉద్యోగావకాశాలు వస్తాయని తెలిపారు. యాపిల్ స్టోర్ల వల్ల దేశానికి ఆర్థికంగా 10 బిలియన్ డాలర్ల వరకు లాభాలుంటాయని వెల్లడించారు.