సూసైడ్ చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కు అప్లికేషన్ ఇచ్చారు ఓ రైతు. తనకు ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు తుంపల్లికి చెందిన గోపాల్ అనే రైతు. చెరువు నిండా నీళ్లున్నా.... పంటలకు వాటర్ ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పులి ఒర్రె ప్రాజెక్టునిర్మించి11సంవత్సరాలైనాకాలువ పనులు పూర్తికాకపోవడంతో..చేనుకునీళ్లురావడంలేదని తెలిపారు. కాల్వలు తీసినట్లు ఆఫీసర్లు రికార్డులు రాసుకున్నప్పటికీ ఎక్కడా తీయలేదన్నారు. చెరువులో నిండా నీళ్లున్నా కాల్వలు లేక పొలాలకు నీళ్లు అందుతలేవని.. బతుకు దెరువు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు .ఈనెల 27లోపు సమస్య పరిష్కరించాలని, లేదంటే తనకు కలెక్టర్ ఆఫీస్ ముందు సూసైడ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.
మరిన్ని వార్తల కోసం