బీసీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

బీసీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

బీసీ గురుకులాల్లో 6,7,8 తరగతులు, ఇంటర్, డిగ్రీలో ఉన్న ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్యభట్టు తెలిపారు. బీసీ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం http://mjptbcwreis. telangana.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకో వాలని ఆయన తెలిపారు. 6,7,8 తరగతులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 20 చివరి తేదీ అని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.  మే నెల 2వ తేదీన హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని, ప్రవేశ పరీక్ష మే నెల10న నిర్వహిస్తామని  విద్యాసంస్థల  కార్యదర్శి స్పష్టం చేశారు. 

ఇంటర్, డిగ్రీ సీట్ల కోసం ఏప్రిల్ 16 చివరి తేదీ కాగా ఏప్రిల్ 20వ తేదీ నుంచి హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని  మల్లయ్యభట్టు చెప్పారు. దీనికి సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 29న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని ఆయన తెలిపారు.  ఆగష్టు 31నాటికి అన్ని తరగతుల్లో అడ్మిషన్లు పూర్తి చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు 040 - 23328266, 23322377 నంబర్లను సంప్రదించాలని సూచించారు.