అసెంబ్లీ నియోజకవర్గాల​ వారీగా ఇన్ చార్జ్​ల ఖరారు

 అసెంబ్లీ నియోజకవర్గాల​ వారీగా ఇన్ చార్జ్​ల ఖరారు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిర్వహించనున్న కార్నర్ మీటింగ్ లకు అసెంబ్లీ నియోజకవర్గాల​ వారీగా ఇన్ చార్జ్​లను పార్టీ రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసింది. గురువారం దీనికి సంబంధించిన జాబితాను అధికారికంగా కార్నర్ మీటింగ్ ల ఇన్ చార్జ్​ కాచం వెంకటేశ్వర్లు ప్రకటించనున్నారు. నియోజకవర్గాల వారీగా ఖరారైన నేతల జాబితాలో కొందరు ముఖ్యులు ఉన్నారు. వారిలో ఉప్పల్, కూకట్ పల్లికి స్టేట్  పార్టీ చీఫ్ బండి సంజయ్, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, మహేశ్వరానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మేడ్చల్ కు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, భువనగిరికి ఎమ్మెల్యే రఘునందన్ రావు, సూర్యాపేటకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శేరిలింగంపల్లికి మురళీధర్  రావు, మహబూబ్ నగర్ కు డీకే అరుణ పేర్లు ఖరారయ్యాయని పార్టీ వర్గాలు ప్రకటించాయి.