సీసీఎస్​కు ముగ్గురు డైరెక్టర్ల నియామకం

సీసీఎస్​కు ముగ్గురు డైరెక్టర్ల నియామకం

హైదరాబాద్, వెలుగు: క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్)  కి ముగ్గురు డైరెక్టర్లను సహకార శాఖ నియమించింది. గ్రేటర్ హైదరాబాద్  జోన్, కరీంనగర్  జోన్, ఆర్టీసీ హెడ్ ఆఫీస్  నుంచి ఈ ముగ్గురు ప్రాతినిధ్యం వహించనున్నారు. బస్ భవన్  నుంచి యాదగిరి, కరీంనగర్  జోన్ నుంచి లక్ష్మయ్య, గ్రేటర్  హైదరాబాద్  జోన్ నుంచి ఎల్లారెడ్డికి చోటు దక్కింది. సోమవారం సీసీఎస్  బోర్డు సమావేశం జరగనుంది. ముఖ్యంగా సీసీఎస్​కు ఆర్టీసీ మేనేజ్ మెంట్ గత రెండేళ్లుగా రూ.1035 కోట్లు బకాయి ఉంది. ఆర్టీసీ అధికారులపై సీసీఎస్ సెక్రటరీ ఒత్తిడి తెస్తున్నా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా చెల్లించడం లేదు. దీనిపై పలుమార్లు హైకోర్టు లో సీసీఎస్  పిటిషన్  దాఖలు చేసింది. హైకోర్టు సైతం ఈ బకాయిల్లో రూ.200 కోట్లు చెల్లించాలని ఇటీవల ఆదేశించింది. గడువు ముగిసినా ఆ బకాయిలను ఆర్టీసీ చెల్లించలేదు. దీనిపై వచ్చే వారం హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సీసీఎస్  భేటీ కానుంది.