ఏఆర్‌ రెహ్మాన్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు

ఏఆర్‌ రెహ్మాన్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు

ప్రముఖ సంగీత దర్శకుడు, అస్కార్‌ అవార్డు విజేత ఏఆర్‌ రెహ్మాన్‌ కు.. పన్ను ఎగవేత కేసులో మద్రాస్‌ హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఆదాయపన్ను శాఖ అధికారులు దాఖలు చేసిన వ్యాజ్యంపై తమకు సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ ప్రకారం.. 2012లో బ్రిటన్‌కు చెందిన టెలికాం అనే ప్రైవేటు కంపెనీతో ఏఆర్‌ రెహ్మాన్‌ ఓ అగ్రిమెంట్ కుదుర్చకున్నాడు. దాని విలువ 3.47 కోట్ల రుపాయాలు. అయితే ఈ మొత్తానికి కట్టాల్సిన పన్నును రెహ్మాన్‌ చెల్లించకుండా ఏగవేతకు పాల్పడ్డాడని ఆదాయపన్ను అధికారులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తమకు వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు ఏఆర్‌ రెహ్మాన్‌ను ఆదేశిస్తూ శుక్రవారం నోటీసులు జారీచేసింది.