ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై అడ్వకేట్ జనరల్ బిస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. రాజాసింగ్ పై నిబంధనల ప్రకారమే పీడీ యాక్ట్ నమోదైందని హైకోర్టుకు తెలిపారు. అయితే ఇది కేవలం కక్ష సాధింపేనని రాజాసింగ్ తరపు న్యాయవాది ఎల్ రవి చందర్ చెప్పారు. రాజాసింగ్ విషయంలో పీడీ యాక్ట్ నిబంధనలను పోలీసులు ఎక్కడా పాటించలేదని ఆయన ఆరోపించారు. ఇక తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు మరోసారి బిస్ ప్రసాద్ వాదనలు వినిపించనున్నారు.
ఇదిలా ఉండగా తన భర్తపై అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టారంటూ రాజాసింగ్ భార్య కొన్ని రోజుల క్రితమే హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ను సమర్థిస్తూ తీర్పు వెల్లడించింది. పీడీ యాక్ట్ను ఎత్తివేయాలని రాజాసింగ్ భార్య ఉషాబాయి వేసిన రివోక్ పిటిషన్ను రెజెక్ట్ చేసింది. పోలీసులు అందించిన సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించిన కోర్టు... సుప్రీంకోర్టు ప్రొసీజర్ ప్రకారమే చర్యలు తీసుకున్నారని స్పష్టం చేసింది. చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్న రాజాసింగ్పై నిబంధనల ప్రకారం ఏడాది కాలం పీడీ అమలు చేయాలని ఆదేశించింది.