గచ్చిబౌలి, వెలుగు : శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా...మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్అభ్యర్థి, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్డివిజన్లలోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ముందుగా ఆయనకు మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికారు. బొటానికల్ గార్డెన్ వద్ద మార్నింగ్వాకర్స్ను కలిసి ఓటు వేయాలని గాంధీ అభ్యర్థించారు.
శేరిలింగంపల్లిలో ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు నిర్మించామని, ప్రయాణం సాఫీగా సాగేందుకు రోడ్లు వేయించామని గుర్తుచేశారు. ఈ నెల30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్సాయిబాబా, బీఆర్ఎస్నేతలు, కార్యకర్తలు ఉన్నారు.