అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా.. : అరెకపూడి గాంధీ

అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా.. : అరెకపూడి గాంధీ

గచ్చిబౌలి, వెలుగు : శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా...మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్​అభ్యర్థి, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్​డివిజన్లలోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ముందుగా ఆయనకు మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికారు. బొటానికల్ గార్డెన్​ వద్ద మార్నింగ్​వాకర్స్​ను కలిసి ఓటు వేయాలని గాంధీ అభ్యర్థించారు.

శేరిలింగంపల్లిలో ట్రాఫిక్​ సమస్యలను తొలగించేందుకు ఫ్లై ఓవర్లు, అండర్​పాస్​లు నిర్మించామని, ప్రయాణం సాఫీగా సాగేందుకు రోడ్లు వేయించామని గుర్తుచేశారు. ఈ నెల30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్​సాయిబాబా, బీఆర్ఎస్​నేతలు, కార్యకర్తలు ఉన్నారు.