జమ్మూలో ఎన్​కౌంటర్.. జవాన్​ మృతి

జమ్మూలో ఎన్​కౌంటర్.. జవాన్​ మృతి
  • ఆర్మీ మేజర్​ సహా నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు
  • పాకిస్తాన్​ టెర్రరిస్ట్​ హతం    

శ్రీనగర్​: జమ్మూకాశ్మీర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఆర్మీ జవాన్​ ఒకరు మృతిచెందారు. ఆర్మీ మేజర్​ సహా నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కుప్వారా జిల్లాలో ఎల్​వోసీ వద్ద చొరబాట్లను అడ్డుకునేందుకు శనివారం ఆర్మీ సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టింది. దీంతో మన ఆర్మీపైకి పాకిస్థాన్​కు చెందిన బోర్డర్​ యాక్షన్​ టీమ్​ (బీఏటీ) కాల్పులు జరిపింది. మన ఆర్మీ కూడా ఎదురుకాల్పులు చేపట్టింది. ఎన్​కౌంటర్​లో ఓ జవాన్​ వీరమరణం పొందారని, మేజర్ సహా నలుగురు గాయపడ్డారని ఆర్మీ తెలిపింది. 

పాక్​కు చెందిన ఓ టెర్రరిస్టు కూడా హతమయ్యాడని తెలిపింది. ముందుగా  సెక్యూరిటీ పోస్టుపైకి ముగ్గురు చొరబాటుదారులు గ్రనైడ్​ విసరడంతో ఆర్మీ సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టగా.. బీఏటీ కాల్పులకు తెగబడిందని పేర్కొంది. కాగా, నాలుగురోజుల్లో ఇది రెండో ఎన్​కౌంటర్​. ఈ నెల 24న కుప్వారా జిల్లా లోలబ్ లో జరిగిన ఎన్​కౌంటర్​లో కూడా ఓ జవాన్​ చనిపోయాడు.