మంచులో చిక్కుకున్న టూరిస్టులు..

మంచులో చిక్కుకున్న టూరిస్టులు..

గ్యాంగ్​టక్ : సిక్కింలో విపరీతంగా మంచు కురవడంతో నాథులా ఏరియాలో సుమారు వంద వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై దట్టంగా మంచు పేరుకుపోవడంతో ముందుకు కదిలే వీలులేకుండా పోయింది. ఈ వాహనాల్లో సుమారు 400 మంది టూరిస్టులు చిక్కుకుపోయారు. నాథులా, త్సోంగో సరస్సును సందర్శించి తిరిగొస్తుండగా మంచు కారణంగా వారి వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి.

దీనిపై సమాచారం అందుకున్న ఆర్మీ సిబ్బంది (త్రిశక్తి కోర్​) స్థానిక పోలీసులతో కలిసి ఆపరేషన్​ హిమరాత్​ చేపట్టారు. రాత్రంతా శ్రమించి టూరిస్టులు అందరినీ సేఫ్​ గా తరలించారు. ఆదివారం ఉదయం రోడ్లపై మంచును తొలగించి టూరిస్టుల వాహనాలను తీసుకొచ్చారు.