ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు

వికారాబాద్, వెలుగు : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. సోమవారం ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. పరీక్షలు సజావుగా జరిగేలా అన్నిశాఖల అధికారులు సహకరించాలి సూచించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి  జూన్ 3 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు.

ఫస్ట్ ఇయర్ కు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు సెకండ్ ఇయర్ మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు రెండు దఫాలుగా ఉంటుందని తెలిపారు. వికారాబాద్ లో 6,  తాండూరులో 4, పరిగిలో 4 , నవాబ్ పేట్, పెద్దేముల్, మర్పల్లి, మోమిన్ పేట్, దోమ, కొడంగల్, కుల్కచెర్ల మండలాల్లో ఒక్కో పరీక్ష  చొప్పున మొత్తం  20  సెంటర్లను ఏర్పాటు చేసి  తగు సౌకర్యాలను కల్పించినట్లు వివరించారు.  మొత్తం 7,831 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారన్నారు.

సెంటర్లలోకి మొబైల్స్,  వాచ్ లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు పర్మిషన్ లేదని, కేంద్రాల వద్ద144 సెక్షన్ విధించి  పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.  ఈ సమావేశంలో ఆర్టీసీ డిపో మేనేజర్ బిక్షు నాయక్, పోస్టల్ అధికారి పద్మారావు, విద్యుత్ శాఖ  ఏడీ రామచంద్రయ్య, ఆర్డీఓ డీఏఈ గోవిందమ్మ, సీఐ వెంకటేశ్​,  జూనియర్ లెక్చరర్ బుచ్చయ్య, వైద్య ఆరోగ్య శాఖ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.