హుజూర్‌‌నగర్‌‌లో నామినేషన్​కు వెళ్తున్న సర్పంచ్ ల అరెస్ట్

హుజూర్‌‌నగర్‌‌లో నామినేషన్​కు వెళ్తున్న సర్పంచ్ ల అరెస్ట్

​హైదరాబాద్​, వెలుగు: హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్​ వేయడానికి వెళుతున్న సర్పంచ్​లను టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్​, మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మితో పాటు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని సికింద్రాబాద్​ టాస్క్​ఫోర్స్​ ఆఫీసుకు తీసుకెళ్లి ఫోన్లను లాగేసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉందని సర్పంచులు అన్నారు. అరెస్టులను సర్పంచులు ఖండించాలని కోరారు. బేషరతుగా తమను విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. అరెస్టులకు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సర్పంచుల అరెస్ట్​పై సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్​ చందర్​, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డికి ఫోన్​లో ఫిర్యాదు చేశారు. ఆయన డీజీపీతో మాట్లాడారని చెప్పారు.