
పంజాబ్ లో భగవంత్ మాన్ సర్కార్ బాగా పని చేయబోతుందన్నారు ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్. ప్రభుత్వం ఏర్పాటైన మూడ్రోజుల్లోనే దేశం మొత్తం భగవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడుతోందన్నారు. మూడు రోజుల్లోనే గొప్ప పనిచేశాడన్నారు. అవినీతి నిర్మూలనకు చర్యలు, ఉద్యోగాల భర్తీ ప్రకటనపై పంజాబ్ సీఎంను అభినందించారు. అక్టోబర్ లో పంట నష్టపోయిన రైతులకు త్వరలోనే పరిహారం అందుతుందని చెప్పారు. పంజాబ్ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు కేజ్రీవాల్.