గుజరాత్లోఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అహ్మదాబాద్లో ఈ రోజు పర్యటించిన ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ... ఢిల్లీ ఎన్నికల్లో తన గెలుపులో ఆటో డ్రైవర్లు కీలక పాత్ర పోషించారని, గుజరాత్లోనూ అదే పని చేయాలని ఆయన కోరారు.
Delhi CM @ArvindKejriwal accepts a Dinner Invitation from an Autorickshaw Driver of Gujarat ❤️#TownhallWithKejriwal pic.twitter.com/0lf5kS5rkn
— AAP (@AamAadmiParty) September 12, 2022
కేజ్రీవాల్ మాట్లాడుతుండగా విక్రమ్ దత్తా అనే ఆటో డ్రైవర్ నిలబడి " నేను మీకు వీరాభిమానిని. పంజాబ్లోని ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో మీరు భోజనం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వీడియో చూశాను. మీరు మా ఇంటికి డిన్నర్ కు వస్తారా" అని అడిగాడు. దీనిపై వెంటనే స్పందించిన ఢిల్లీ సీఎం ‘తప్పకుండా వస్తా’ అని బదులిచ్చాడు.
‘నాతో పాటు మరో ఇద్దరు నేతలు మీ ఇంటికి భోజనానికి వస్తారు. రాత్రి 8 గంటలకు నీ ఆటోలో మమ్మల్ని తీసుకెళ్తావా ?’ అని కేజ్రీవాల్ అడిగారు. ఇందుకు విక్రమ్ సంతోషంగా అంగీకరించాడు. దీనికి సంబంధించిన వీడియోని ఆమ్ ఆద్మీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.