
హైదరాబాద్: సంతానం కోరుకునే దంపతులకు రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో మార్గనిర్దేశం చేస్తున్న ఆర్య జనని యువతకు స్కాలర్ షిప్పులు అందించేందుకు మరోసారి ముందుకు వచ్చింది. ఇందుకోసం18 నుంచి 30 సంవత్సరాల లోపు యువతీ యువకులకు జాతీయస్థాయి ఆన్ లైన్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించనుంది.
స్వామి వివేకానంద ప్రాక్టికల్ వేదాంత, జ్ఞాన యోగ ప్రసంగాల ఆధారంగా రూపొందించిన నాలెడ్జ్ స్ట్రెంత్ అనే పుస్తకంపై టెస్ట్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మాక్ టెస్ట్ జూలై 20న జరగనుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్యజనని వెబ్సైట్ https://aaryajananicontests.org/ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు డాక్టర్ అనుపమ రెడ్డి తెలిపారు.
https://aaryajananicontests.org/login/signup.php. లాగిన్ కావాలి.మెయిన్ క్విజ్ ఆగస్టు మూడున జరగనుంది. విజేతలైన 150 మంది యువతీ యువకులకు ఆకర్షణీయ స్కాలర్షిప్పులు అందిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 8977863881 నెంబర్ కు వాట్సాప్ చేయాలని సూచించారు.
హైదరాబాద్ రామకృష్ణ మఠం లోని వివేకానంద హెల్త్ సెంటర్లో సేవలందిస్తున్న ప్రత్యేక వైద్యుల బృందం 2018 సంవత్సరంలో ఆర్యజనని ప్రారంభించింది. అనేక మంది ఉత్సాహవంతులైన, సేవాభావతత్పరులైన వైద్యులు, యోగా నిపుణులు, క్లినికల్ సైకాలజిస్టులు, సాఫ్ట్వేర్ నిపుణులు, గాయకులు ఆర్యజనని బృందంలో ఉన్నారు.
ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఐదు సంవత్సరాలుగా, ఆర్యజనని సంస్థ, కాబోయే తల్లి తండ్రులకు ..స్పృహతో కూడిన గర్భధారణ, పేరెంటింగ్.... గురించి అవగాహన కల్పించే విధంగా ఆఫ్ లైన్... ఆన్ లైన్ వర్క్ షాప్ లు నిర్వహిస్తోంది.
ఇది గర్భిణీ స్త్రీలు, వారి శిశువుల శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. యోగా, ధ్యానం, బేబీ బాండింగ్ టెక్నిక్స్, ఆత్మీయ గానం, ప్రెగ్నెన్సీ లైఫ్ స్టైల్ తదితర అంశాలతో పాటు మూడు గంటల వర్క్ షాప్ లో ఆధ్యాత్మికత, ఆధునిక విజ్ఞానంతో కూడిన అద్భుతమైన మేళవింపు లాంటి విషయాలను తెలియజేస్తారు. కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యం.. శారీరక... భావోద్వేగ.... మేధోపరమైన, ఆధ్యాత్మిక ఉన్నతికి ఈ వర్క్ షాప్ ఎంతో ఉపయోగపడుతుంది.