మంత్రి వివేక్ వెంకటస్వామికి కాల్వ సుజాత క్షమాపణ చెప్పాలి..ఆర్యవైశ్య మహాసభ నేతల డిమాండ్

మంత్రి వివేక్ వెంకటస్వామికి కాల్వ సుజాత క్షమాపణ చెప్పాలి..ఆర్యవైశ్య మహాసభ నేతల డిమాండ్

హైదరాబాద్​సిటీ, వెలుగు: మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్​పర్సన్​ కాల్వ సుజాత  వెంటనే క్షమాపణలు  చెప్పాలని తెలంగాణ ఆర్యమహాసభ నేతలు డిమాండ్​చేశారు. మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, ట్రెజరర్​మల్లికార్జున్, ఆర్గనైజింగ్​సెక్రటరీ గణేశ్​గుప్తా, సెక్రటరీ ముక్తా శ్రీనివాస్​ గురువారం ఖైరతాబాద్​చింతల్ బస్తీలోని మహాసభ ఆఫీసులో మాట్లాడారు. 

కాల్వ సుజాత కాంగ్రెస్​లో కొనసాగుతూ ఆ పార్టీలోనే ఉన్న మంత్రి వివేక్​వెంకటస్వామిని దూషించడం సరికాదన్నారు. ఆర్య వైశ్యులు మంత్రి దగ్గరికి సొంత ప్రయోజనాల కోసం వెళ్లలేదని, ఆర్య వైశ్య సంస్థ కోసం వెళ్లి కలిశామన్నారు. సుజాత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆమె  బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే సీఎం రేవంత్​రెడ్డి వద్దకు విషయాన్ని తీసుకెళ్తామన్నారు.