భారత్ మాతాకీ జై నినాదాల మధ్య అసదుద్దీన్ ప్రమాణం

భారత్ మాతాకీ జై నినాదాల మధ్య అసదుద్దీన్ ప్రమాణం

లోక్ సభ సభ్యుల ప్రమాణ స్వీకారం ఇవాళ కూడా కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ఎంపీలు ఇవాళ లోక్ సభలో సభ్యులుగా ప్రమాణం చేశారు. మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణం ఆసక్తిగా జరిగింది. ఆయన్ను ప్రమాణానికి లోక్ సభ అధికారులు పిల్చినప్పుడు.. బీజేపీ సభ్యులు భారత్ మాతాకీ జై నినాదాలు చేశారు. చేయండి.. అలాగే నినాదాలు చేయండి… అంటూ నవ్వుతూ… చేతులు ఊపుతూ అసదుద్దీన్ స్పీకర్ పోడియం ముందుకు వచ్చారు. కొంచెం వాళ్లను ఆపండి ప్రమాణం చేస్తాను అని అధికారులకు చెప్పారు. తర్వాత ఉర్దూలో ప్రమాణం చేశారు అసదుద్దీన్. చివర్లో జై భీమ్.. జై మీమ్… అల్లాహో అక్బర్.. జై హింద్ అంటూ ముగించారు అసదుద్దీన్ ఒవైసీ.