ఊరూరా బోనాల సంబురాలు

ఊరూరా బోనాల సంబురాలు

కోల్​బెల్ట్/నిజామాబాద్/కొత్తపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులోని గాంధారిఖిల్లా మైసమ్మ ఆషాడ బోనాల జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తులు మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. క్యాతనపల్లి మున్సిపల్​చైర్​పర్సన్​ సంధ్యరాణి -రాజా రమేశ్​దంపతులు, ప్రజాప్రతినిధులు, నాయక్ ​పోడ్​ గిరిజన సంఘం లీడర్లు ప్రత్యేక పూజలు చేశారు. మందమర్రిలోని యాపల్​ ప్రాంతంలోని పోచమ్మ తల్లి ఆలయంలో ఆషాడ బోనాల వేడుకలు నిర్వహించారు. 

మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, -జడ్పీ మాజీ చైర్​పర్సన్​ భాగ్యలక్ష్మి దంపతుల, మున్సిపల్​కమిషనర్​రాజలింగు, లీడర్లు పూజలు చేశారు. నిజామాబాద్​లోని పాత కలెక్టరేట్ వద్ద తెలంగాణ గెజిటెడ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. క్యాక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, టీజీవో అధ్యక్షుడు అలుక కిషన్, ఉద్యోగులు  పాల్గొన్నారు.