రాజాస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఓ కార్యక్రమంలో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో మైక్ సరిగ్గా పనిచేయకపోవడంతో మైక్ ను అధికారి వైపు కోపంగా విసిరారు. అక్కడే ఉన్న మహిళ మరో మైక్ ను సీఎంకు అందించింది.
2023 జూన్ 02 శుక్రవారం రోజున బార్మర్ సర్క్యూట్ హౌస్లో మహిళల కోసం కేటాయించిన పలు ప్రభుత్వ పథకాలపై ఫీడ్బ్యాక్ సేకరించేందుకు మహిళలతో సీఎం సంభాషిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.