
అశ్విన్ బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మూలి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ను అనౌన్స్ చేశారు. ‘శివం భజే’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘మా కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ ఇది.
ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది. టెక్నికల్గా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’ అని చెప్పాడు. ‘వైవిధ్యమైన కథ, కథనాలతో తీస్తున్న న్యూ ఏజ్ సినిమా ఇది. కామెడీ, డ్రామా, యాక్షన్ థ్రిల్స్తో ఉత్కంఠ భరితంగా ఉంటుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని నిర్మాత అన్నారు. హైపర్ ఆది, సాయి ధీన, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.